హుజూర్‌న‌గ‌ర్ ప్ర‌చారంలోకి నంద‌మూరి ఆడ‌ప‌డుచు

-

హుజూర్‌నగర్ ఉప ఎన్నికను టీడీపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తుంది. కాగా, హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కిరణ్మయిని తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఇతర పార్టీలకు దీటుగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. తెలంగాణలో టీడీపీ ఇప్పటికీ బలంగానే ఉందని చాటి చెప్పేందుకు గెలుపు కోసం వ్యూహరచన చేస్తోంది. ఈ క్ర‌మంలోనే తెలుగు దేశం అభ్యర్థి కిరణ్మయికి మద్దతుగా నందమూరి సుహాసినిని ప్రచార బరిలోకి దించాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి.

గత ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేసి పరాజయం పాలైన సంగతి తెలిసిందే.రేపటి నుంచి మూడు రోజుల పాటు సుహాసిని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని తెలుస్తోంది. సుహాసిని ప్రచారం చేయడం వల్ల మహిళల ఓటు బ్యాంకు పెరుగుతుందని టీటీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ కూడా హుజూర్‌నగర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశమున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news