అబ్బాయే బాబాయ్ ని చంపేశాడు: నారా లోకేష్

-

నరసన్నపేటలో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడారు ఈ నేపథ్యం లో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తారని అన్నారు. బాబాయ్ ని చంపింది ఎవరు? పిన్ని తాళిబొట్టు తెంపింది ఎవరు అని లోకేష్ అన్నారు.

అలానే అబ్బాయే బాబాయిని చంపారని ఇది జగనాసుర రక్త చరిత్ర అని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చంపినట్లు ఆరోపించారని ఇక ఈరోజు ఛార్జ్ షీట్ లో వైసీపీ నేత సొంత బంధువు అవినాష్ రెడ్డి ముద్దాయి అని రేపోమాపో ఏ నైన్ లో జగన్మోహన్ రెడ్డి ఉంటారని అన్నారు. ఒక క్విజ్ పెడతానని ప్రతిరోజు జగన్ ఏం తాగుతారని ఆప్షన్స్ ఇచ్చారు చివరి ఆప్షన్ గా ఇచ్చిన ప్రజల రక్తం సరైన సమాధానంగా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news