కనుసైగ చేస్తే చాలు..నువ్వే రా తేల్చుకుందాం..నారా లోకేష్ వార్నింగ్..!

-

ఏపీలో టీడీపీ నేత‌ల ఇండ్ల‌పై దాడులు..టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యం పై దాడి నేప‌థ్యంలో నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ట్విట్ట‌ర్ వేధిక‌గా లోకేష్ వ‌రుస ట్వీట్ లు చేస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నీ కార్యాల‌యాల విధ్వంసం నిమిషం ప‌ని… నీ ఫ్యాన్ రెక్క‌లు మ‌డిచి విరిచి నీ పెయిడ్ ఆర్టిస్టుల్ని రాష్ట్రం దాటేంత‌వ‌ర‌కూ త‌రిమి కొడ‌తారు మా కార్య‌క‌ర్త‌లు అంటూ లోకేష్ పేర్కొన్నారు. అన్ని ఆన‌వాయితీల‌ని బ్రేక్ చేసి, ప్ర‌జాస్వామ్యానికి పాత‌రేసి..నీ స‌మాధికి నువ్వే గొయ్యి త‌వ్వుకుంటున్నావు కోడికత్తిగా అంటూ లోకేష్ మండిప‌డ్డారు. తెలుగుదేశం స‌హ‌నం చేత‌కానిత‌నం అనుకుంటున్నావా? నీ ప‌త‌నానికి ఒక్కో ఇటుకా నువ్వే పేర్చుకుంటున్నావని పేర్కొన్నారు.

నిన్ను ఉరికించి కొట్ట‌డానికి తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రంలేదని…. నీ అరాచ‌కాల‌పై ఆగ్ర‌హంగా వున్న కేడ‌ర్‌కి మా లీడ‌ర్ క‌నుసైగ చేస్తే చాలు అంటూ లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ ముఖ్య‌మంత్రి అని గౌర‌వించి గారూ అనేవాడినని…. నీ వికృత‌, క్రూర బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్‌, డ్ర‌గ్గిస్ట్ జ‌గ‌న్ అని అని అంటున్నా అంటూ లోకేష్ రెచ్చిపోయారు. నువ్వూ, నీ బినామీలు డ్ర‌గ్స్ బిజినెస్ చేస్తారు… నిల‌దీసే టిడిపి నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డ‌తావా? అంటూ లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news