బ్రేకింగ్ : టీడీపీ కార్యాలయాల‌పై దాడులు..ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచల‌న వ్యాఖ్య‌లు…!

-

టీడీపీ ఆఫీసులపై దాడిని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఖండించారు. ఏపీ చరిత్రలో ఇలాంటి దాడులు జరగలేదని ప‌వ‌న్ అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి దాడులు మంచిదికాదని… ఇలాంటి దాడులు అరాచకాలకు దారితీస్తాయని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్ర‌జాస్వామ్యంలో వ్య‌క్తిగ‌త నియంత్ర‌ణ పాటించాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. వ్య‌క్తిగ‌త దాడుల‌కు జ‌రిగితే అది అరాచ‌కానికి దారిస్తుంద‌ని..ప్ర‌జ‌ల‌కు అది మంచిది కాద‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం మ‌రియు పోలీస్ శాఖ వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. దాడి చేసిన వాళ్ల‌ని వెంట‌నే అరెస్ట్ చేసి క‌ఠినంగా శిక్షించాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ డిమాండ్ చేశారు.pawan kalyan latest speech

అందుతున్న స‌మాచారం ప్ర‌కారం వైసీపీ వ‌ర్గాలు దాడి చేశాయ‌ని..అదే నిజం అయితే వైసీపీ నాయక‌త్వానికి ఒక‌టే చెబుతున్నా అని భ‌విష్యత్తులో ఇలాంటి పోక‌డ‌ల‌కు వెళితే అది ప్ర‌జాస్వామ్యానికే గొడ్డ‌లి పెట్టు అని ప‌వ‌న్ క‌ల్యాణ్ హెచ్చ‌రించారు. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే టీడీపీ ఆఫీసుల మీద జ‌రిగిన దాడుల‌పై అధినేత చంద్ర‌బాబు ప్ర‌ధానికి లేఖ రాశారు. కేంద్ర బ‌ల‌గాల‌ను పంపించాల‌ని చంద్రాబాబు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news