గుడివాడలో గడ్డం గ్యాంగ్ కి గుండు కొట్టించే రోజు దగ్గర్లో ఉంది – నారా లోకేష్

-

కొడాలి నాని పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో గడ్డం గ్యాంగ్ కి గుండు కొట్టించే రోజు అతి దగ్గర్లో ఉందన్నారు. అధికారపక్షం రౌడీలు రాళ్ళు వేసినా, భౌతిక దాడులు చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తాo అంటే మా దగ్గర అంత కంటే పెద్ద రాళ్ళే ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు నారా లోకేష్.

 

గుడివాడలో టిడిపి నేత రావి వెంకటేశ్వరరావుని చంపేస్తామని బెదిరిస్తూ..ఆస్తులు ధ్వంసం చేసి, టిడిపి కార్యకర్తలపై గడ్డం గ్యాంగ్ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు సైకో పాలనకి చరమగీతం పాడేందుకు సిద్దంగా ఉన్నారనే విషయం సర్వేల్లో తేలడంతోనే జగన్ రెడ్డి గూండాలను నమ్ముకుంటున్నాడు. గుడివాడ టిడిపి వారిపై బెదిరింపులు, దాడులకు పాల్పడిన వైసిపి గడ్డం గ్యాంగ్ పై కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు లోకేశ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version