జగన్ అమూల్ బేబీ… లోకేష్ హాట్ కామెంట్స్

-

సంగం డయిరీ కేసులో గత రాత్రి బెయిల్ పై విడుదలై విజయవాడ చేరుకున్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా కొన్ని కామెంట్ లు కూడా చేసారు. జగన్ రెడ్డి ఓ అమూల్ బేబీ అని అన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. పాడి రైతులకు రూ.4 ఎక్కువ ఇవ్వటం, ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందించటం తప్పా అని ప్రశ్నించారు.

దశాబ్దాల నుంచి రైతు ప్రయోజనాల కోసం పని చేస్తున్న సంగం డెయిరీ పై కక్ష సాధింపు దుర్మార్గం అని ఆయన మండిపడ్డారు. అమరావతిలో లేని ఇన్సైడర్ ట్రేడింగ్ ని స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా నరేంద్ర బయటపెట్టారు అని అమూల్ డైయిరీ కోసం ప్రజా ధనం ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు అని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో డైయిరీలన్నీ గుజరాత్ కు కట్టబెట్టే యత్నం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version