36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తెచ్చింది లేదంటూ కేటీఆర్ ఆగ్రహించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎస్సెల్బీసీ సొరంగం కూలి ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుంటే… ఎన్నికల ప్రచారంలో మునిగి తేలావ్..అంటూ ఆగ్రహించారు. మూడు నెలలుగా జీతాల్లేక అల్లాడుతున్నామని కార్మికులు వాపోతుంటే… ఎన్నికల ప్రచారం ముగించుకుని నిమ్మలంగా మళ్లీ హస్తిన బాటపట్టావ్ అంటూ ఫైర్ అయ్యారు. సొరంగంలో సహాయక చర్యలు ఒక్కడుగు ముందుకు .. వందడుగులు వెనక్కి అన్నట్లుగా ఉందని తెలిపారు.
అక్కడ ఆక్సిజన్ లేదు… కన్వేయర్ బెల్టు తెగిపోయిందని విమర్శలు చేశారు. 96 గంటలు దాటినా ఒక్కడుగూ ముందుకు పడడం లేదన్నారు. కాళేశ్వరం పర్రెల మీద శ్రీశైలం అగ్నిప్రమాదం మీద కారుకూతలు కూసి, విషపు రాతలు రాసిన మేధావుల నోళ్లు ఎస్సెల్బీసీ విషయంలో మాత్రం నోరెత్తడం లేదని ఫైర్ అయ్యారు. హస్తిన యాత్రలు మాని ఆ కార్మికుల గోడు వినండని కోరారు. ఆ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వండని… అక్కడ చిక్కుకున్నవి సాధారణ ప్రాణాలు కాదు .. ఈ జాతి సంపద అని వెల్లడించారు.