రంగులు వేయడానికి డబ్బులు ఉంటాయి గానీ, వాళ్ళకు లేవు !

-

వైసీపీ తోడు దొంగలు నన్ను తిరగకుండా దాడులు చేస్తున్నారని ఏపీ మాజీ మంత్రి టీడీపీ కీలక నేత లోకేష్ అన్నారు. అసలు వైసీపీ వాళ్ళే తిరిగితే మేము ఎందుకు వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతామని ప్రశ్నించారు. కొల్లేరుకు ఇంతకుముందు ఎన్నడూ లేని రీతిలో వరదలు వచ్చాయని కానీ వారిని ఆదుకునే చర్యలు లేవని అన్నారు. ఒక మంత్రి బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నాడని, మేము తిరుగుతున్నామని ఆగమేఘాల మీద నిధులు విడుదల చేస్తున్నారని అన్నారు.

lokesh

రంగులు వేయడానికి డబ్బులు ఉంటాయి గానీ, రైతులను ఆదుకోవడానికి డబ్బులు లేవని లోకేష్ ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం పోరాటం చేయకుండా.. కేంద్రం వద్ద తాకట్టు పెట్టేశారని లోకేష్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారో లేదో పిల్ల కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. అమరావతి కోసం రైతులు పోరాటం చేస్తుంటే, బయట నుంచి మనుష్యులను తీసుకు వచ్చి కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version