జగన్ కి ఆ పర్సనాలిటీ డిజార్డర్.. లోకేష్ సంచలనం !

-

జగన్ రెడ్డి గారు ”యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్” తో బాధపడుతున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు. విధ్వంసం ఈ వ్యాధి ప్రధాన లక్షణమని అయున అన్నారు. వైకాపా ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగడుతున్నారు అన్న అక్కసుతో కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా టిడిపి నేత సబ్బంహరి గారి ఇంటిని కూల్చివెయ్యడానికి కుట్ర పన్నారని ఆయన అన్నారు. ఉన్నత విలువలతో రాజకీయాల్లో ఉన్న సబ్బంహరి గారి పై కక్షసాధింపు చర్యలు జగన్ రెడ్డి గారిని మరింత దిగజార్చాయని ఆయన అన్నారు.

ప్రశ్నిస్తే చంపేస్తాం,విమర్శిస్తే కూల్చేస్తాం అంటూ జగన్ రెడ్డి గారు తనలో ఉన్న సైకో మనస్తత్వాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారని ఆయన అన్నారు. విధ్వంసం తో ప్రజాగ్రహాన్ని అణిచివేయ్యడం నియంతలకు సాద్యం కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని ఆయన అన్నారు. ఇక ఇదే అంశం మీద అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ విధ్వంసం తప్ప అభివృద్ధి అనేది జగన్ రెడ్డి గారి డిక్షనరిలో లేదని, అమరావతి లో ప్రారంభమైన విధ్వంసం విశాఖకు చేరుకుందని అన్నారు. జగన్ రెడ్డి గారి చెత్త పాలనని ప్రశ్నించినందుకే సబ్బంహరి గారి ఇంటిని కూల్చివేస్తున్నారని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version