నన్ను బూతులు తిట్టారు : నారాయణ స్వామి

-

అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి తనను బూతులు తిట్టారని డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించారు. వీరాంజనేయ స్వామితో పాటు మిగిలిన సభ్యులు కూడా తనపై అసభ్య పదజాలాన్ని ఉపయోగించారన్నారు.

వీరందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని కోరారు. చంద్రబాబు నాయుడు కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాగా  ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ మరియు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ నెలకొంది. జీవో నెంబర్ 1 పై చర్చించాలని టిడిపి నేతలు పట్టుబట్టగా…. తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో టిడిపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి… వైసిపి ఎమ్మెల్యే సుధాకర్ బాబు పరస్పరం దాడి చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news