మోడీ నాయకత్వాన్ని దేశం మరోసారి కోరుకుంటుంది: బండి సంజయ్

-

ఇప్పటికే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ దేశంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఇక, తెలంగాణలో మాత్రం అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఉంటుందని చాలావరకు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ గెలవబోయే ఎంపీ సీట్ల సంఖ్యపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ 10 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని అన్నారు . గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని, అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కాంగ్రెస్ మీద కోపంతో ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారని తెలిపారు. ప్రధాని మోడీ బలమైన నాయకత్వాన్ని దేశం మరోసారి కోరుకుంటుందన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version