తెలంగాణలో ఇంటింటికి తెలుగుదేశం – చంద్రబాబు

-

తెలంగాణలో “ఇంటింటికి తెలుగుదేశం” ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఆదివారం హైదరాబాద్ లో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తెలంగాణలో టిడిపి ఎక్కడుంది అనేవారు.. ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందని చెప్పారు.

సైబర్ టవర్స్ నిర్మించిన ఘనత తెలుగుదేశం పార్టీదని.. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చింది తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని, తెలుగుదేశం ఎక్కడ ఉంది అనే వారికి ఖమ్మం సభ తర్వాత సమాధానం దొరికిందన్నారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు చంద్రబాబు. రెండు కిలోల బియ్యంతో ఎంతోమంది పేదల కడుపు టిడిపి నింపిందని వివరించారు. అడ్మినిస్ట్రేషన్ అంటే తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత అని మాట్లాడుకునేలా చేశామన్నారు. తెలంగాణ ఉన్నంతవరకు టిడిపి ఉంటుందని.. మార్చి 29న పరేడ్ గ్రౌండ్స్ లో టిడిపి ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహిస్తామన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news