పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం.. ఒకే కుటుంబంలో 10 మంది మృతి

-

ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. పది మంది ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని జగతరా సమీపంలో వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

Road-Accident
Road-Accident

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల కోసం.. రాయ్‌పుర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్​ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. వీరంతా కాంకేర్​ జిల్లాలో బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్నారని చెప్పారు. కాగా, మృతులు ధామ్‌తరి జిల్లాలోని సోరెమ్​ భట్‌గావ్ గ్రామంలో నివాసముండే ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఈ విషాదం గురించి తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బగేల్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన బాలిక త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news