156 ఔషధాలు బ్యాన్ చేసిన కేంద్రం

-

రోగుల ప్రాణాలకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణాలకు ముప్పుతెచ్చే అవకాశం ఉన్న 156 రకాల ఔషధాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే నిషేధిత జాబితాలో ఎక్కువగా జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీలకు వాడే ఔషధాలు ఉండటం గమనార్హం. అయితే ఇలాంటి వ్యాధులకు తరచూ మందులు వాడుతుంటారు. ఈ నేపథ్యంలో వీటిని ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉందని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మెఫెనమిక్‌ యాసిడ్‌ + పారాసెటమాల్‌ ఇంజెక్షన్, సెట్రిజెన్‌ హెచ్‌సీఎల్‌+ పారాసెటమాల్‌+ ఫినైలెప్రైన్‌ హెచ్‌సీఎల్, లెవొసెట్రిజిన్‌+ ఫినైలెప్రైన్‌ హెచ్‌సీఎల్‌+ పారాసెటమాల్‌, ఎసెక్లోఫెనాక్‌ 500 ఎంజీ + పారాసెటమాల్‌ 125 ఎంజీ ట్యాబ్లెట్స్ వంటివి నిషేధిత ఔషధాల జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదలైంది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు ఉండగా ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ (ఎఫ్‌డీసీ) ఔషధాలను వాడడం ప్రమాదాన్ని ఆహ్వానించడమే అవుతుందని కేంద్ర ప్రభుత్వం ఆ నోటిఫికేషన్లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news