CM Chandrababu: ఇవాళ కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన..కారణం ఇదే

-

అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు పయనం కానున్నారు. ఇవాళ ఉదయమే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు పయనం కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి అయినవిల్లిలో టిటిడి కళ్యాణమండపం వద్ద హెలిపాడ్ లో 11.40కి దిగుతారు సీఎం చంద్రబాబు నాయుడు. అక్కడ అధికారులు నేతలతో కొద్దిసేపు మాట్లాడనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వానపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామసభాస్థలికి చేరుకుంటున్నారు సీఎం చంద్రబాబు.

వానపల్లి గ్రామదేవత పళ్ళాలమ్మను దర్శించుకుంటారు బాబు. 12 గంటల నుండి రెండు గంటలపాటు గ్రామసభలో పాల్గొంటారు బాబు. అనంతరం పదినిమిషాల పాటు స్థానిక నేతలతో ముచ్చటిస్తారని సమాచారం. అనంతరం వానపల్లి నుంచి రోడ్డు మార్గాన తిరిగి అయినవిల్లి హెలిపాడ్ వద్దకు చేరుకొని హెలికాప్టర్ లో రాజమండ్రి కి వెళ్ళి అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ కు వెళ్ళనున్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news