ఒడిశా రైలు ప్రమాదంలో కరెంట్​ షాక్​తోనే 40 మంది మృతి!

-

గతవారం ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే 280కు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘోర ప్రమాదంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 278 మంది మరణించగా, వారిలో కనీసం 40 మంది విద్యుత్​ షాక్​ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ మేరకు సహాయక చర్యలను పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రమాదం జరిగిన తర్వాత ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది.. పట్టాలు తప్పిన బోగీల్లోంచి మృతదేహాలను బయటకు తీశారు. అందులో కనీసం 40 మృతదేహాలపై గాయాలు, రక్తస్రావం కనిపించలేదని పోలీసు అధికారి తెలిపారు. తమ ఎఫ్​ఐఆర్​లో ప్రభుత్వ రైల్వే పోలీసులు కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో లైవ్ ఓవర్ హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడడం వల్ల.. విద్యుత్​ షాక్​ తగిలిందని రైల్వే పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news