లక్నో జైల్లో కలకలం.. 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్‌

-

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో జిల్లా కారాగారంలో కలకలం చోటుచేసుకుంది. ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్న 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని నిర్ధరణ కావడంతో అధికారులు షాక్ అవుతున్నారు. డిసెంబర్‌లో నిర్వహించిన పరీక్షల్లో 36 మందికి ఈ వైరస్‌ సోకినట్లు తేలిందని అధికారులు తెలిపారు. తాజాగా ఆ సంఖ్య మరింత పెరిగినట్లు వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తికి గల కారణాలపై స్పష్టత లేదు.

వైరస్ సోకిన వారిలో చాలా మందికి డ్రగ్స్‌ తీసుకునే అలవాటుందని వాటిని శరీరంలోకి ఎక్కించుకునే క్రమంలో ఒకరు ఉపయోగించిన సిరంజిని మరొకరు వాడటం వల్లే ఈ వైరస్‌ వ్యాపించిందని జైలు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వీరందరికీ ముందే హెచ్‌ఐవీ ఉందని, ఈ జైలులోకి వచ్చిన తర్వాత ఎవరికీ సంక్రమించలేదని తెలిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో బాధితులందరికీ లక్నోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. గత ఐదేళ్లలో ఈ జైలులో ఇంతపెద్ద మొత్తంలో హెచ్‌ఐవీ కేసులు బయటపడటం ఇదే తొలిసారి అని చెప్పారు దీనికి గల కారణాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news