దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు.. మహిళలు 47 కోట్లు

-

మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో మహిళా ఓటర్లు 47 కోట్ల మంది ఉన్నారని సీఈసీ వెల్లడించింది. అంతే కాకుండా ఓటు వేసేందుకు అర్హులైన వారిలో 1.73 కోట్ల మంది 18 – 19 ఏళ్ల వయసు వారే ఉన్నారని తెలిపింది.

Vote from Home in Andhra Pradesh

ఎన్నికల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 12 లక్షల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. దాదాపు 1.5 కోట్ల మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించనున్నట్లు వెల్లడించాయి. దేశంలో 1951లో 17.32 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉండగా.. 2019 నాటికి ఈ సంఖ్య 91.20 కోట్లకు చేరిందని గతేడాది రాజకీయ పార్టీలకు పంపిన ఓ లేఖలో ఎన్నికల సంఘం పేర్కొంది. గత పార్లమెంటు ఎన్నికల్లో 67 శాతంగా ఉందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news