మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసుల దుర్మరణం

-

మహారాష్ట్రలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు మరణించారు. కొందరు మిత్రులు విహార యాత్ర కోసం కారులో మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ చికల్‌దరా వద్ద ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరందరూ నల్లగొండ, ఆదిలాబాద్‌కు చెందినవారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి గురైన కారులో ఆరుగురు గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగులు. ఇందులో ఇద్దరు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టీ)కి చెందినవారు. వీరు పలు మండలాల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో వారు ఉద్యోగులుగా ఉన్నారు. మరికొందరు మిత్రులతో కలిసి మహారాష్ట్రలోని చికల్‌దరాకు విహారయాత్రకు వెళ్లారు. ఇందుకోసం వారు ఎర్టిగా కారును ఎంచుకున్నారు. ఆ కారులోనే వారు వెళ్లుతుండగా అమరావతి జిల్లా వద్ద కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఇందులో అర్లి(టీ)కి చెందిన వైభవ్, సల్మాన్‌లు ఉన్నారు. అలాగే.. శివకృష్ణ, కొటేశ్వర్‌లు కూడా మృతి చెందారు. షేక్ సల్మాన్ కారు డ్రైవింగ్ చేస్తున్నట్టు సమాచారం. శ్యామ్ రెడ్డి, సుమన్, యశోద యాదవ్, హరీశ్‌లు తీవ్రంగా గాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news