ఆదిత్య ఎల్​1 రెండో భూ కక్ష్య పెంపు విజయవంతం

-

సూర్యుడి గుట్టు తెలుసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆదిత్య-ఎల్1 మిషన్​ చేపట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్1 లక్ష్యం దిశగా సాగుతోందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీనికి సంబంధించి రెండో భూ కక్ష్య పెంపు ప్రక్రియను చేపట్టినట్లు వెల్లడించారు. బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్​వర్క్​ ఈ ఆపరేషన్​ను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు.

ప్రస్తుతం ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహం.. 282 కిలో మీటర్లు బై 40,225 కిలోమీటర్ల నూతన కక్ష్యలో ప్రవేశించినట్లు ఇస్రో తెలిపింది. తదుపరి కక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబర్ 10 చేపడతామని వెల్లడించింది. సెప్టెంబర్​ 3న భూ కక్ష్య పెంపు తొలి విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొంది.

సెప్టెంబర్ 2న నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్1.. 63 నిమిషాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం 1480.7 కిలోల ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశించింది. 16 రోజుల పాటు భూ కక్ష్యల్లోనే చక్కర్లు కొట్టనుంది. అనంతరం భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్దేశిత ఎల్‌1 బిందువు దిశగా.. 125 రోజుల ప్రయాణం తర్వాత చేరుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news