అర్థరాత్రి రైలుని ఆపి భారీ ప్రమాదం నుంచి కాపాడిన వృద్ధ దంపతులు

-

అర్థరాత్రి రైలుని ఆపి భారీ ప్రమాదం నుంచి కాపాడారు ఇద్దరు వృద్ధ దంపతులు. ఇప్పుడు ఈ సంఘటన దేశ వ్యాప్తంగా హాల్‌ చల్‌ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైలోని భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుంచి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది.

An elderly couple who stopped a late night train and saved them from a huge accident

అయితే..ఈ ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేసి భారీ ప్రమాదం నుంచి కాపాడారు. దీంతో ఎలాంటి ప్రమాదం అక్కడ జరుగలేదు. ఇక ఈ సహసం చేసిన వృద్ధ దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news