పోరుబందర్లో రూ.480 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

-

ఇటీవలే అరేబియా సముద్రంలో భారీ అంతర్జాతీయ స్మగ్లింగ్‌ రాకెట్‌ను భారత నౌకాదళం ఛేదించిన విషయం తెలిసిందే. పోర్‌బందర్‌లో భారత నౌకా దళం, యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సంయుక్తంగా భారీ ఆపరేషన్‌ నిర్వహించి 3,300 కిలోల డ్రగ్స్‌ను సీజ్‌ చేశాయి. ఇది మరవకముందే దేశంలో మరో అతిపెద్ద డ్రగ్‌ రాకెట్‌ను నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో ఛేదించింది.

భారత్‌లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రల్ని నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో భగ్నం చేసింది. ఎన్సీబీ , గుజరాత్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.480 కోట్ల విలువైన డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లోని పోరుబందర్‌ తీరంలో నౌక నుంచి వాటిని సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతే కాకుండా పాకిస్థాన్‌కు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. డ్రగ్‌ సరఫరాకు వీరు వినియోగించిన నౌక భారత్‌కు చెందినదిగా గుర్తించినట్లు చెప్పారు. దిల్లీ, పంజాబ్‌లకు మత్తు పదార్థాలు స్మగ్లింగ్‌ చేసేందుకు నిందితులు యత్నించినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version