ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీలకులు నియామకం

-

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ జనరల్ అబ్జర్వర్ గా రిటైర్డ్ ఐఏఎస్ రామ్ మోహన్ మిశ్రా, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్గా రిటైర్డ్ ఐపీఎస్ దీపక్ మిశ్రా, స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ నియమితులయ్యారు. వచ్చే వారం నుంచి ప్రత్యేక ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులపై నిఘా పెట్టనున్నారు. అనుమానం వచ్చిన వారిపై పరిశీలకులు పరిశీలించనున్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు పరిశీలకులు.

Read more RELATED
Recommended to you

Latest news