కరెన్సీ నోట్లపై అర్ధనగ్నంగా నిద్ర.. ఆ నేత ఫొటో వైరల్

-

అసోంలో ఓ రాజకీయ నేత కరెన్సీ నోట్లపై అర్ధనగ్నంగా నిద్రించడం వివాదాస్పదమైంది. యూపీపీఎల్‌ పార్టీలో పని చేసిన బెంజమిన్‌ బసుమతారీ అనే నాయకుడు 500 రూపాయల నోట్లపై పడుకున్న చిత్రం వైరల్‌ అయింది. ఉదల్గురీ జిల్లాకు చెందిన బెంజమిన్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉండటంతో ఈ వ్యవహారంతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని యూపీపీఎల్ పార్టీ చీఫ్ ప్రమోద్‌ బోరో స్పష్టత ఇచ్చారు. బెంజమిన్‌ను జనవరిలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని తెలిపారు. పార్టీకి బెంజమిన్కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, గ్రామీణ ఉపాధి హామీ పథకాల అమలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ బెంజమిన్పై పలు కేసులున్నాయి. ఆయన విలేజ్‌ కౌన్సిల్ డెవలప్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో లబ్ధిదారుల నుంచి లంచం తీసుకున్నారని అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో యూపీపీఎల్ పార్టీ స్పందిస్తూ.. జెంజమిన్ను జనవరి 10నే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని తెలిపింది. హరిసింగ బ్లాక్ కమిటీ, యూపీపీఎల్ నుంచి జనవరి 5న లేఖ అందుకున్న తర్వాత బెంజమిన్పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news