స్పేస్ సెక్టార్​లో భారత్‌ పాత్ర పెరుగుతోంది.. స్పేష్ స్టేషన్ మాజీ కమాండర్ ప్రశంసలు

-

భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో)పై అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న చంద్రయాన్-3తో జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి అడుగుపెట్టిన ఇస్రో.. ఇప్పుడు సూర్యుడి కూపీ లాగేందుకు ఆదిత్య ఎల్-1 మిషన్​ ప్రయోగం చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే అంతరిక్ష పరిశోధనల్లో దూసుకెళ్తున్న భారత్‌ను తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మాజీ కమాండర్ క్రిస్‌ హడ్‌ఫీల్డ్‌ ప్రశంసించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాంకేతిక రంగంలో భారత్‌ సాధిస్తోన్న విజయాలను ఆయన కొనియాడారు. ఈ భూమిపై ప్రతి ఒక్కరు సాంకేతికతపై ఆధారపడి ఉన్నారని వ్యాఖ్యానించారు.

సూర్యుడి గురించి మరింతగా అర్థం చేసుకునేందుకు, దాని నుంచి ఎదురయ్యే ముప్పులను పసిగట్టేందుకు ఆదిత్య-ఎల్‌1(Aditya-L1) వంటి ప్రయోగాలు ఉపకరిస్తాయని క్రిస్‌ హడ్‌ఫీల్డ్‌ అన్నారు. భూమిపై ఉన్న ప్రతిఒక్కరు సాంకేతికతపై ఆధారపడి ఉన్నారని.. ఎలక్ట్రిక్ గ్రిడ్‌, ఇంటర్నెట్‌ గ్రిడ్‌, రోదసిలోని ఉపగ్రహాలు, వ్యోమనౌకలను సమర్థంగా రక్షించుకోవడానికి ఈ ప్రయోగం కీలకం కానుందని తెలిపారు. ఈ భూమండలంపై సూర్యుడి ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి దోహదం చేస్తుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news