సూర్య కుమార్ యాదవ్ కు బీసీసీఐ కీలక పదవి !

-

సూర్య కుమార్ యాదవ్ కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇవ్వనుంది బీసీసీఐ. ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ అనంతరం భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడనున్న టి20 సిరీస్ కు సూర్య కుమార్ యాదవ్, ఋతురాజ్ గైక్వాడ్ లో ఒకరు టీం ఇండియాకు సారథ్యం వహించనున్నారు. వరల్డ్ కప్ తర్వాత ఆసీస్ తో భారత జట్టు 5 మ్యాచ్ల టి20 సిరీస్ ఆడనుండగా… దానికి సూర్యకుమార్, ఋతురాజ్ లో ఒకరు టీం ఇండియాకు నాయకత్వం వహించనున్నారు.

BCCI key post for Surya Kumar Yadav

ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండేది అనుమానంగా మారడంతో ఈ ఇద్దరిలో ఒకరికి సారధ్య బాధ్యతలు అప్పగించాలని టీం మేనేజ్మెంట్ యోచిస్తున్నది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో పాండ్యాకు మరింత విశ్రాంతి అవసరం అని బోర్డు భావిస్తున్నది. అయితే.. ఎక్కువ శాతం సూర్య కుమార్‌ యాదవ్‌ కే కెప్టెన్సీ బాధ్యతలు రానున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news