BREAKING: నోయిడాలో ట్విన్ టవర్స్ కూల్చివేత.. వీడియో వైరల్

-

నోయిడా లోని ట్విన్ టవర్స్ ను ఆదివారం రోజు మధ్యాహ్నం కూల్చి వేశారు అధికారులు. మధ్యాహ్నం 2:32 నిమిషాలకు ఈ భవనాలను కూల్చివేశారు. ఈ భవనాల విలువ రూ.1200 కోట్లు ఉంటుంది. ట్విన్ టవర్స్ కూల్చివేతకు రూ. 20 కోట్లకు పైగా ఖర్చు చేశారు అధికారులు. సినిమాలలో చూపించినట్టుగానే క్షణాల వ్యవధిలో ఈ భారీ బవంతులు నేలమట్టం అయ్యాయి. చివరిసారిగా ఈ భవనాల ముందు సెల్ఫీలు దిగేందుకు పెద్ద ఎత్తున స్థానికులు ఇక్కడికి వచ్చారు.

ఈ టవర్స్ కూల్చివేత కోసం అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చుట్టుపక్కల నివాసం ఉన్న వారిని ముందు జాగ్రత్తగా అక్కడి నుంచి ఖాళీ చేయించారు. దేశ రాజధాని ఢిల్లీకి 50 కిలోమీటర్ల దూరంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో సూపర్ టెక్ సంస్థ ఈ ట్విన్ టవర్స్ ను నిర్మించింది. ఈ భవనాల కూల్చివేత కారణంగా ఏర్పడిన వ్యర్ధాల తొలగింపునకు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముంబై కి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఈ ట్విన్ టవర్స్ ను కూల్చివేసే బాధ్యతలను తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news