దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనాతో ఇండియా వ్యాప్తంగా ఏడుగురు మృతి చెందారు. వెయ్యికిపైగా యాక్టివ్ కేసులు అయ్యాయి. అత్యధికంగా కేరళలో 430 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్ లో 83 కేసులు నమోదు అయ్యాయి.

అటు కరోనా కేసుల సమయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ అడ్వైజరీని ఉపసంహరించింది ఏపీ ప్రభుత్వం. మహానాడు కోసమే ఉత్తర్వులు జారీ అంటూ వైసీపీ విమర్శలు చేస్తున్నారు. కాగా.. కోవిడ్ కేసుల నేపథ్యంలో ఈ నెల 21న అడ్వైజరీ జారీ చేసింది ప్రభుత్వం. కోవిడ్ అడ్వైజరీని ఉపసంహరించడంతో బహిరంగ సభలు, ర్యాలీలు, జనసమీకరణ చేపట్టొద్దని ఆదేశాలు ఇచ్చారు.