తెరుచుకున్న బద్రినాథ్‌ ఆలయ తలుపులు.. పోటెత్తిన భక్తులు

-

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రినాథ్‌ ఆలయం ఇవాళ తెరుచుకుంది. శీతాకాలం సందర్భంగా మూసివేసిన ఈ ఆలయాన్ని చార్‌ ధామ్‌ యాత్రలో భాగంగా భక్తుల కోసం ఈరోజు తిరిగి తెరిచారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఇవాళ ఉదయం 6 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ‘బద్రీ విశాల్ లాల్ కీ జై’ అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక పూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.

పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో బద్రినాథ్‌ ఆలయం ఒకటి. చార్‌ధామ్‌ యాత్రలో బద్రినాథ్‌ దేవాలయం సందర్శన ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు బద్రినాథుడిని దర్శించుకుంటారు. శీతాకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు. దాదాపు ఆరు నెలల పాటు మూసి ఉన్న ఈ ఆలయ తలుపులు భక్తుల దర్శనార్థం నేడు తెరుచుకున్నాయి.

మరోవైపు చార్‌ ధామ్‌ యాత్ర శుక్రవారం నుంచే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం శుక్రవారం నాడే తెరుచుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news