రెండో వివాహానికి సిద్ధమైన సీఎం.. రేపే పెళ్లి

-

ఇటీవలే పంజాబ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆప్ నేత భగవంత్ మాన్ రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడు. రేపు ఆయన తన రెండో వివాహాన్ని అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. చండీగఢ్ లో డాక్టర్ గురుప్రీత్ కోర్ ను పెళ్లాడనున్నారు. ఈ వివాహ వేడుకకు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్లు సమాచారం.

పంజాబ్ సీఎం తన మొదటి భార్య ఇంద్ర ప్రీత్ కౌర్ కు ఆరేళ్ల క్రితం విడాకులు ఇచ్చారు. ఇద్దరు పిల్లలతో ఇంద్ర ప్రీత్ సింగ్ అమెరికాలో ఉంటున్నారు. సీఎం గా భగవంత్ మాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఈ ఇద్దరు పిల్లలు ఇటీవల హాజరయ్యారు. అయితే ఆరేళ్లుగా వివాహం అనే మాట ఎత్తకుండా సాగిన భగవంత్ తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే రెండో పెళ్లి చేసుకుంటూ ఉండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news