ఉత్తరప్రదేశ్ లో మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర..!

-

ఉత్తరప్రదేశ్ లో మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. రాయబరేలీలో మరో రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై ఉంచిన సిమెంట్ స్లాబ్లను గూడ్స్ రైలు ఢీకొట్టింది. రాయబరేలిలోని లక్ష్మణ్ పూర్ లో ఈ ఘటన జరిగింది. అయితే, రైలు ప్రమాదానికి కుట్ర పన్నినట్లు అధికారులు భావిస్తున్నారు. సమీపంలోని పొలంలో ఉంచిన మూడు సిమెంటు దిమ్మెలను ట్రాక్ పైకి తీసుకువచ్చినట్లు అనుమానిస్తున్నారు. లోకో పైలట్ అప్రమత్తత వల్ల ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశారు. ఆర్పీఎఫ్ ఉంచాహర్ బృందం దీనిపై దర్యాప్తు చేస్తోంది.

గత నెల రోజులుగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగించడానికి రైలు పట్టాలపై వస్తువులను ఉంచిన ఘటనలు చాలానే  జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్ జిల్లాలో రైల్వే ట్రాక్పై ఇనుప రాడ్లను ఉంచి రైలు పట్టాలు తప్పేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు గత వారమే అరెస్టు చేశారు. కాన్పూర్ లో గ్యాస్ సిలిండర్లను ట్రాక్ ల పై ఉంచడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్ లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఆర్మీ సిబ్బంది ప్రయాణిస్తున్న రైలును పేల్చేసే ప్రయత్నంలో రైల్వే ట్రాక్ పై డిటోనేటర్లు పెట్టడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version