దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. 6 వేలు దాటిన సంఖ్య

-

కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసులు..భారీగా పెరుగుతున్నాయి. ఇండియాలో కరోనా కేసులు సంఖ్య 6 వేలు దాటాయి. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6,133 గా ఉంది. గడిచిన 24 గంటల్లో 378 కొత్త కేసులు, 6 కోవిడ్ మరణాలు నమోదు అయ్యాయి. కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు కరోనా వల్ల మృతి చెందారు.

covid

ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి చనిపోయినవారి సంఖ్య 65గా నమోదు అయింది. కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులను గుర్తించింది ఆరోగ్య శాఖ. అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు ప్రభుత్వాలు సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news