దేశంలో 15 లక్షలు దాటిన కేసులు, వేగంగా పెరుగుతున్న మరణాలు…!

-

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా ఉన్నామని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నా సరే పరిస్థితి మాత్రం కాస్త భిన్నంగానే ఉంది అనే చెప్పాలి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా… 48 వేల 513 మందికి కరోనా సోకింది. మొత్తం కేసులు 15 లక్షల 31 వేలు దాటాయి. 768 మంది కరోనా బారిన పడి గత 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయారు.

coronavirus

ఇక కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 9 లక్షల 88 వేలకు చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 34 వేల 193 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా కరోనా టెస్ట్ లు 4 లక్షలకు పైగా చేస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా టెస్ట్ లు కోటీ 77 లక్షల వరకు చేసారు. 5 లక్షల 50 వేల వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయి. దక్షినాది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version