తల్లి చంపి..మృతదేహాన్ని డ్రమ్‌లో పెట్టిన కసాయి కోడుకు..!

-

చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లి మృతదేహాన్ని డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో కప్పేశాడు ఓ కసాయి కోడుకు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. చెన్నై నీలాంకరై సరస్వతి నగర్‌కు చెందిన గోపాల్, షెన్బగం దంపతులకు ముగ్గురు కూమారులు ఉన్నారు.. ఇంట్లో చిన్న కుమారుడు సురేష్‌ తో కలసి ఉంటుంది తల్లి షెన్బగం.

అయితే.. ఆదివారం సాయంత్రం తల్లిని చూసేందుకు పెద్ద కుమారుడు ప్రభు వచ్చాడు. తల్లి ఇంట్లో లేదని చెప్పడంతో అనుమానంతో పోలీసుల్ని ఆశ్రయించారు ప్రభు. ఈ నేపథ్యంలోనే..ఇంట్లోనీ డ్రమ్‌లో తల్లి మృతదేహం ఉన్నట్టు సురేష్‌ చెప్పడంతో షాక్ అయ్యారు పోలీసులు.

డ్రమ్‌ను పగల కొట్టి షెన్భగం మృతదేహం బయట తీశారు పోలీసులు.. నీలాంగరైలో కలకలం రేపిన ఈ ఘటన హత్యానా, సహజ మరణమా? అని పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.
కుమారుడి మానసిక స్థితి సరి లేక ఇలాచేసి ఉంటాడని స్థానికులు అంటున్నారు. ఇక ఈ ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news