బెంగాల్‌లో బాంబు పేలుడు

-

పశ్చిమ బెంగాల్‌లో బాంబు పేలుడు సంభ‌వించింది. కమర్హతి గోలఘాట్ ప్రాంతంలోని ఒక ఇంట్లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులని సాజిద్, రాజాగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం వచ్చిన తరువాత, కమర్హతి అవుట్‌ పోస్ట్‌ పోలీసులు ఘ‌టనా స్థలానికి చేరుకుని గాయపడిన నలుగురిని సమీపంలోని దవాఖానకు తరలించారు. అందులో ఇద్దరు చనిపోయినట్లు ప్రకటించగా, వారిలో ఒకరు తీవ్రంగా గాయపడి సాగర్ దత్తా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే.. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. జ‌నం ప‌రుగులు తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news