IPL 2023 : ఇవాళ ఐపీఎల్‌ ఫైనల్‌.. మళ్లీ వర్షం పడితే ఛాంపియన్ గా గుజరాత్ !

-

IPL 2023 : ఇవాళ ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్ జరుగనుంది. నిన్న వర్షం కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ఫైనల్ రిజర్వ్ డే అయిన నేడు జరగనుంది. రాత్రి 7:30 గంటలకు గుజరాత్, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. సీఎస్కే ఐదోసారి కప్పును ఖాతాలో వేసుకోవాలని చూస్తుండగా… గుజరాత్ వరుసగా రెండోసారి గెలవాలని భావిస్తోంది.

నిన్న టికెట్ తీసుకున్న ప్రేక్షకులకు నేడు మ్యాచ్ చూసే అవకాశం కల్పించారు. ఈరోజు కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ కూడా వర్షం అంతరాయం కలిగిస్తే… ముందుగా 5 ఓవర్ల మ్యాచ్ ను నిర్వహిస్తారు. అది కూడా సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ ను ఎంచుకుంటారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకపోతే మొత్తంగా మ్యాచ్ ను రద్దు చేస్తారు. అనంతరం లీగ్ స్టేజీలో గ్రూప్ టాపర్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ను విజేతగా ప్రకటిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news