భీవండి ఘ‌ట‌న‌లో 17కు చేరిన మృతుల సంఖ్య‌

-

మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండిలో మూడు అంత‌స్తుల‌ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. సోమవారం తెల్లవారుజూమున భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై భ‌వ‌నం శిథిలాల కింద చిక్కుకుపోయిన 20 మందిని రక్షించినట్లు జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళాలు( ఎన్డీఆర్‌ఎఫ్‌) బృందాలు తెలిపాయి. భవనం శిథిలావస్థకు చేరడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా తీవ్ర విషాదం నెల‌కొంది. ఎటుచూసినా.. గుండెల‌విసేలా వినిపిస్తున్న రోద‌న‌లే..!

ఇదిలా ఉండ‌గా.. మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. *భీవండి ఘటన ఎంతగానో కలచివేసింది. బాధితుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి* అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ట్వీట్‌ చేశారు. *భవనం కూలిపోవడం చాలా విచారకరం. తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబాలకు నా సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. బాధితులకు అన్ని విధాలా సాయం అందిస్తాం* అని ప్రధాని న‌రేంద్ర‌మోదీ ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news