డ్రగ్స్‌ కేసు: ఎన్‌సీబీ ఎదుట హాజరైన దీపికా

-

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణ వేగంగా కొన‌సాగుతోంది. ఇందులో భాగంగా హీరోయిన్‌ దీపికా పదుకొనే ఎన్‌సీబీ ఎదుట శనివారం విచారణకు హాజరైంది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) రెండు రోజుల క్రితం విచారణకు హాజరుకావల్సిందిగా దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులకు సమన్లు పంపిన విషయం తెలిసిందే.

శుక్రవారం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఎన్‌సీబీ ఎదుట హాజరవ్వగా.. శనివారం దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్‌, సారా అలీ ఖాన్‌లను విచారించనున్నారు. ముంబై కొలాబాలోని అపోలో బండర్‌లో ఎవెలిన్ గెస్ట్ హౌస్‌కు ఈ ఉదయం దీపికా పదుకొనే వచ్చారు. అక్కడే ఎన్‌సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. అయితే సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌లను బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఎన్‌సీబీ కార్యాలయంలో విచారించనున్నారు. కాగా.. శుక్రవారం విచారణకు హాజరైన దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాష్‌ను ఈ రోజు మరోసారి పిలిచే అవకాశం ఉంది. కరిష్మా ప్రకాష్‌ను శుక్రవారం సుమారు నాలుగు గంటలపాటు ఎన్‌సీబీ అధికారులు విచారించారు. ఈ విచారణలో ఆమె కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version