నాపై, సీఎం సిద్ధరామయ్యపై చేతబడి చేస్తున్నారు : డీకే శివకుమార్

-

నాపై, సీఎం సిద్ధరామయ్యపై చేతబడి చేస్తున్నారంటూ కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ చీఫ్‌, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులు గవర్నమెంట్‌ను కూల్చడానికి తనపైన, సీఎం సిద్ధరామయ్యపైన శత్రు సంహార యాగాలు చేస్తున్నారని బాంబ్‌ పేల్చారు కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ చీఫ్‌, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్.

DK Shivakumar Says Black Magic Being Performed Against Him, Siddaramaiah

రాజకీయ ప్రత్యర్థులు మా గవర్నమెంట్‌ను కూల్చడానికి తనపైన, సీఎం సిద్ధరామయ్యపైన కేరళలోని రాజరాజేశ్వరి మందిరంలోని అగోరాలు, తాంత్రికులతో కలిసి రాజ కంటక, మారణమోహనా స్థంభన యాగాలు చేస్తున్నారన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. దీంతో కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ చీఫ్‌, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశంలో దుమారం రేపుతున్నాయి. కాగా…సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ మధ్య సీఎం పదవి కోసం నిత్యం గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news