సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!

-

సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్ లో విశ్రాంత ఆర్చ్ బిషప్ తుమ్మబాల పార్ధీవదేహానికి నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్ కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. విశ్రాంత ఆర్చ్ బిషప్ తుమ్మబాల పార్ధీవదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ… సమాజ నిర్మాణంలో తుమ్మబాల ఎనలేని సేవలు అందించారు… శాంతి, మతసామరస్యం, విద్యను వారు ప్రజలకు అందించారని వెల్లడించారు.

Chief Minister Revanth Reddy to St. Mary’s School Secunderabad

వ్యక్తిగతంగా తుమ్మబాలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 2019 ఎంపీ ఎన్నికల్లో, 2023 శాసనసభ ఎన్నికల్లో వారు మమ్మల్ని మంచి మనసుతో ఆశీర్వదించారని వివరించారు. వారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. ఆయన మరణం వారి అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. వారి సేవలను కొనియాడుతూ.. వారి సందేశం స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news