హర్యానా మాజీ గవర్నర్ కన్నుమూత

-

హర్యానా మాజీ గవర్నర్, బీహార్ శాసనసభ మాజీ స్పీకర్ ధనిక్ లాల్ మండల్ (90) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్, గవర్నర్ బండారు దత్తాత్రేయ విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదిక ద్వారా ఆయనకు సంతాపం తెలియజేశారు. మండల్ మృతి సమాజానికి, భారత రాజకీయాలకు తీరని లోటని అభివర్ణించారు బీహార్ సీఎం నితీష్ కుమార్.

కాగా ఆదివారం రాత్రి ధనిక్ లాల్ మండల్ కన్నుమూశారు. బీహార్ లోని మధుబని లో జన్మించిన మండల్ 1967లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత 1969, 72లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సమయంలో అసెంబ్లీ స్పీకర్ గా కూడా పనిచేశారు. రెండుసార్లు లోక్సభ ఎంపీ గాను కొనసాగారు. 1980 జనవరి వరకు హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. దీంతోపాటు 1990 – 95 మధ్యకాలంలో హర్యానా గవర్నర్ గా పనిచేశారు ధనిక్ లాల్ మండల్.

Read more RELATED
Recommended to you

Latest news