సామాన్యులకు శుభవార్త..భారీగా తగ్గిన సిలిండర్ ధరలు..రూ. 83.50 తగ్గింపు

-

దేశంలోని సామాన్య ప్రజలకు బిగ్ అలెర్ట్. జూన్ ఒకటో తారీకు వచ్చిన నేపథ్యంలో గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వ గ్యాస్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. ప్రతినెలా వన్డే గ్యాస్ ధరల సవరణలో భాగంగా ఇవాళ ఎల్పిజి సిలిండర్ ధరను తగ్గించాయి ప్రభుత్వ గ్యాస్ కంపెనీలు.

19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను 83.50 రూపాయలకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు గ్యాస్ కంపెనీల అధికారులు. కమర్షియల్ సిలిండర్ పై గత నెలలో 172 రూపాయలు తగ్గిన సంగతి తెలిసిందే. అయితే గృహ అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పులు చేయ లేదు ప్రభుత్వ గ్యాస్ కంపెనీలు. దీంతో సామాన్య ప్రజలకు భారీ ఊరట కలిగింది.

Read more RELATED
Recommended to you

Latest news