ఉత్తర భారతంలో వరణుడి బీభత్సం.. వర్షాలకు 19 మంది బలి

-

ఉత్తర భారతాన్ని వరణుడు వణికిస్తున్నాడు. కుండపోత వర్షాలు ఉత్తరాదిలో బీభత్సం సృష్టిస్తున్నాయి. రహదారులన్నీ జలదిగ్బంధమై ప్రజలకు ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయి. ఊళ్లు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. ఇక వరదలు, కొండచరియలు విరిగిపడటం, ఇతర ఘటనలలో మృతుల సంఖ్య 19కు చేరింది. అందులో ఇద్దరు సైనికులు ఉన్నారు.

దిల్లీలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అత్యధికంగా దిల్లీలో ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర వరకు 260 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్​, ఉత్తరాఖండ్, దిల్లీ, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌లలో కొన్ని ప్రాంతాల్లో సోమవారం కూడా అతిభారీ వర్షాలు కరుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. హిమాచల్‌లో 10జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లోని అనేక రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. రికార్డు వర్షాల నేపథ్యంలో రోడ్లు, నివాస ప్రాంతాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. దిల్లీ, గురుగ్రామ్, నోయిడాలో పాఠశాలలకు అధికారులు సోమవారం సెలవు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news