Lakshadweep : తెలుగు ప్రజలు లక్షద్వీప్‌ వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుంది?

-

Lakshadweep : లక్షద్వీప్ ట్రెండ్ అవుతోంది. అక్కడికి వెళ్లాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి కొచ్చికి డైలీ విమానాలు ఉన్నాయి. అక్కడి నుంచి జల, వాయు మార్గాల్లో అగత్తి (లక్షద్వీప్)కి వెళ్ళాలి.

How much does it cost for Telugu people to go to Lakshadweep

30 రోజుల ముందు ప్లాన్ చేస్తే కొచ్చికి విమాన ధర రూ. 4, 500 ఉంటుంది. అక్కడి నుంచి విమానంలో అగత్తికి మరో రూ. 5,500 అవుతుంది. జలమార్గమైతే రూ. 2,200 – రూ. 6 వేల వరకు ఉంటుంది. ధరల్లో మార్పులు ఉండచ్చు.

కాగా, జనవరి నాలుగో తేదీన భారత్‌లో అత్యధికంగా శోధించిన పదాల్లో లక్షద్వీప్‌ పదో స్థానంలో నిలిచింది. మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్‌ కోసం ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్న వారి సంఖ్య ఇరవై ఏళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగాలు తెలిపాయి. శుక్రవారం రోజే 50వేల మంది లక్షద్వీప్‌ గురించి గూగుల్‌లో వెతికినట్లు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news