కూలిన మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌.. ఇద్దరు పైలట్లు మృతి

-

భారత్​-పాకిస్థాన్​ సరిహద్దులో వాయుసేనకు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. రాజస్థాన్​ బాడ్​మేర్​ జిల్లాలోని భిమ్​డా గ్రామంలో యుద్ధ విమానం మిగ్-21 కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు.


భిమ్​డా సమీపంలో గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ధ్రువీకరించింది. విమానం కూలిన సమయంలో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. దీనికి సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ప్రమాదంపై భారత వాయుసేన అధిపతి మార్షల్‌ వీఆర్‌ చౌదరితో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పైలట్ల మృతి పట్ల రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి సేవను దేశం ఎప్పుడూ మరిచిపోదన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news