World Cup 2023 : నేడు ఇంగ్లండ్ తో మ్యాచ్..గెలిస్తే భారత్ కు సెమీస్‌ బెర్తు ఖరారు

-

World Cup 2023 : ఇంగ్లాండ్ తో ఈరోజు జరిగే మ్యాచ్ లో గెలిస్తే భారత్ ఖాయం చేసు కున్నట్లే. ప్రస్తుతం భారత్ ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ తో గెలిస్తే 12 పాయింట్లకు చేరుతుం ది. పాయింట్ల టేబుల్ లో పైనున్న నాలుగు జట్లు కాకుండా శ్రీలంక మాత్రమే గరిష్టంగా 12 పాయింట్లకు చేరుకోగలరు.

India vs England, 29th Match

రన్ రేట్ ప్రకారం లేదా శ్రీలంక తర్వాత ఆడనున్న మ్యాచుల ప్రకారం చూసిన భారత్ సెమిస్ బెర్త్ ఖాయమైనట్టే అంటున్నారు విశ్లేషకులు. కాగా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడడం క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. ఇంగ్లాండుతో మ్యాచ్ కోసం నిన్న ప్రాక్టీస్ చేస్తుండగా…. రోహిత్ మనికట్టుకు గాయమైంది. బ్యాటింగ్ చేస్తుండగా బాల్ తాకడంతో వెంటనే ఫిజియో వచ్చి టెస్టులు చేశారు. అయితే గాయం తీవ్రతపై స్పష్టత రాలేదు. ఒకవేళ రోహిత్ శర్మ నేటి మ్యాచ్ కు దూరమైతే కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news