IND vs Aus : రింకూ సింగ్ అద్బుతం..టీమిండియా గ్రాండ్ విక్టరీ

-

వైజాగ్ టీ20లో టీమిండియా విజయం సాధించింది. నిన్న జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై భారత్ విజయం సాధించింది. చివరి బంతి వరకు ఈ మ్యాచ్ సాగింది. కానీ చివరికి 2 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే… రెండు బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన సమయంలో వికెట్ కోల్పోయింది భారత్. వరుసగా మూడు వికెట్లు కోల్పోయి ఉత్కంఠ రేపింది మ్యాచ్.

India won by 2 wkts

వరల్డ్ కప్ ఫైనల్ లో ఓటమికి ఆస్ట్రేలియా పై ప్రతీకారం తీర్చుకుంది టీమ్ ఇండియా. ఆసీస్‌ పై ప్రతీకారం తీర్చుకునేందుకు చెలరేగింది యంగ్ ఇండియా. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 42 బాల్స్ లో 4 సిక్స్ లు, 9 ఫోర్లతో 80 రన్స్ చేశాడు సూర్య కుమార్‌ యాదవ్‌. అటు దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్.. 39 బాల్స్ లో 5 సిక్స్ లు, 2 ఫోర్ల తో 58 రన్స్ చేశాడు. యశస్వి జైస్వాల్ 8 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్ల తో 21 రన్స్ చేశాడు. ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్ 14 బంతుల్లో 28 రన్స్ చేశాడు. చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్‌ను గెలిపించాడు రింకూ సింగ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version