జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

-

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. గత నెల 26న జరిగిన ఈ పరీక్ష ప్రాథమిక కీని ఐఐటీ మద్రాస్‌ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా తుది కీ, JEE Advanced Resultsను ప్రకటించింది. ఫలితాల కోసం క్లిక్ చేయండి

దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించిన ఈ పరీక్షను దాదాపు 2 లక్షల మంది రాశారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది ఉన్నట్లు అంచనా. బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్‌), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా పేరిట సంయుక్తంగా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్‌ 10వ తేదీ నుంచి జులై 23వ తేదీ వరకు కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news