Virat Kohli : డ్రింక్స్ బాయ్ అవతారం ఎత్తిన కోహ్లీ

-

వెండిస్ రెండో వన్డేలో విరాట్ కోహ్లీ డ్రింక్స్ బాయ్ అవతారం ఎత్తారు. ఈ మ్యాచ్ కు మేనేజ్మెంట్ రెస్ట్ ఇవ్వడంతో చాహాల్ తో కలిసి గ్రౌండ్లోని భారత ప్లేయర్లకు డ్రింక్స్ తీసుకెళ్లారు. కింగ్ కోహ్లీ సింప్లీసిటీకి ఇది నిదర్శనమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా… ఈ మ్యాచ్‌ లో వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమిపాలైంది.

నిన్న జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ చేతిలో ఏకంగా ఆరు వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 40 ఓవర్ల లో కేవలం 181 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. టీమిండియా మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో… 181 పరుగులు మాత్రమే చేసింది జట్టు. ఇక అటు 182 పరుగుల లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు.. కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news