ఇంటర్నేషనల్ డ్రగ్స్ దందాలో సినీ నిర్మాత

-

భారత్ లో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టయింది. దిల్లీ పోలీసులు, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో- ఎన్‌సీబీ సంయుక్తంగా ఇంటర్​నేషనల్ డ్రగ్‌ నెట్‌వర్క్‌ను చేధించారు. అంతర్జాతీయంగా రూ.2000 కోట్ల విలువైన డ్రగ్స్​ విక్రయించినట్లు గుర్తించిన అధికారులు.. ఈ వ్యవహారంలో తమిళనాడులోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీ ఉన్నట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలో ‘సూడోపెడ్రిన్‌’ డ్రగ్​ను కిలో రూ.1.5 కోట్ల చొప్పున విక్రయిస్తున్నారు. ఆ దేశాలకు పెద్ద మొత్తంలో సూడోపెడ్రిన్‌ డ్రగ్​ పంపుతున్నట్లు ఎన్‌సీబీకి సమాచారం రాగా గ్‌ మాఫియా కదలికలపై ఎన్‌సీబీ నిఘా పెట్టింది. ఈ డ్రగ్​ను హెల్త్‌ మిక్స్‌ పౌడర్స్‌, కొబ్బరి పొడి సంబంధిత ఆహార ఉత్పత్తులతో కలిపి సముద్ర మార్గాల్లో రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఫిబ్రవరి 15న పశ్చిమ దిల్లీలోని దారాపుర్‌లోని గోదాంలో తనిఖీ చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 50 కిలోల సూడోపెడ్రిన్‌ డ్రగ్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్ సిండికేట్ ఇప్పటి వరకు 3,500 కిలోల సూడోపెడ్రిన్‌తో ఉన్న 45 పార్శిళ్లను ఎగుమతి చేయగా దీని విలువ రూ.2000 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కీలక పాత్ర పోషించినట్లు గుర్తించిన పోలీసులు, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news